వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి
వడదెబ్బకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మొర్రి బిక్షపతి (40) తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి పనులు చేసుకున్నాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లి చెట్టు కింద సేద తీరాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.