వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట శివారులో ఆదివారం లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్రగాయాలు కాగా అతన్ని నర్సంపేట జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీలో ధాన్యం మల్లంపల్లి వద్ద లోడు చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.