లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

2634చూసినవారు
లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం శ్రీనివాస్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఆదివారం జనగామ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పల్లగుట్ట క్రాస్ వద్ద ఆగి ఉన్న లారీను ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :