ఒమన్ రాజధాని మస్కట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకరు భారతీయుడు ఉన్నారని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మిగిలిన నలుగురు పాకిస్థానీయులుగా అధికారులు గుర్తించారు. దాడి చేసిన ముగ్గురు దుండగులను మట్టుబెట్టినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.