పోలీస్ ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన పేర్ని పుష్ప అనే మహిళ భర్త చనిపోగా రైతు బీమా డబ్బులు వచ్చాయి. తమ ఇంటి పక్కనే ఉన్న మల్కాపురం లక్ష్మయ్య అనే వ్యక్తి తన అవసరం నిమిత్తం డబ్బులను వడ్డీ కింద తీసుకున్నాడు. పలుమార్లు అతన్ని డబ్బులు అడిగినా డబ్బులకు బదులు భూమి రాసిస్తానని చెప్పి తమను మోసం చేశారంటూ బాధితురాలు పుష్ప ఆదివారం వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకుంది.