Jul 24, 2024, 04:07 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
పేదల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్: రంజిత్ కుమార్
Jul 24, 2024, 04:07 IST
దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని బుధవారం వరంగల్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు రంజిత్ కుమార్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్లో ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంచడం సంతోషకరమన్నారు.