హనుమకొండ జిల్లాలోని హనుమాన్ జంక్షన్ నుండి పద్మాక్షి రోడ్డు వెళ్లే మార్గంలో రోడ్డు మధ్యలో నుండి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయి మంచి నీరు వృధాగా పోతుంది. రోడ్లపై నీరు ప్రవహించడం వల్ల కాలినడకన పోయే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు అంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.