104 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

78చూసినవారు
అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని వరంగల్ టాస్క్ ఫోర్స్, ఐలోని పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నట్లు ఏఎస్సై ఆర్ఎస్ శర్మ గురువారం సాయంత్రం తెలిపారు. పంథిని గ్రామంలో మూడు పౌల్ట్రీ ఫామ్ లలో తనిఖీలు చేశారు. శారద పౌల్ట్రీ ఫామ్లో 74. 50 క్వింటాళ్లు, అభిరామ్ పౌల్ట్రీ ఫామ్లో 22. 45, ఎస్ఎస్ఎస్ పౌల్ట్రీ ఫామ్లో 7. 30 క్వింటాళ్లను పట్టుకున్నట్లు తెలిపారు. రైస్ మిల్లు ఓనర్ లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్