టీమ్
ఇండియా మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో నాగ్పూర్ పోలీసులు వైద్యను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు వైద్యను కోర్టులో హాజరుపర్చగా.. పూచికత్తుపై అతడిని విడుదల చేశారు. నాగ్పూర్కు చెందిన వ్యాపారి నుంచి వైద్య 1.9 కోట్ల విలువైన స్టీల్ కొనుగోలు చేసి, దానికి చెక్లను ఇచ్చాడు. ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు.