మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో శనివారం విషాద ఘటన జరిగింది. గణేష్ గైక్వాడ్ (21) అనే యువకుడు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. నర్మదా కెనాల్లోని పిప్రి డ్యామ్లో దూకాడు. అయితే సుడిగుండంలో చిక్కుకుని, కొట్టుకుపోయాడు. నీటిలో మునిగి చివరికి చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. గణేష్ సుడిగుండంలో మునిగి చనిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.