కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెల్లలోనే రుణమాఫీ చేసి చూపించామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ విమర్శలను తిప్పి కొట్టారు. రూ.2లక్షలు రుణమాఫీ చేయలేదని చెప్పడం అవాస్తమన్నారు.ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన దానికంటే ఎక్కువ మేలు చేశామన్నారు.