AP: రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ కార్డు లేని ఆరేళ్లలోపు చిన్నారులు 1,86,709 మంది ఉన్నట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖ గుర్తించింది. వీరితో పాటు ఆధార్లో తమ వివరాలు అప్డేట్ చేసుకోని వారు దాదాపు 52.02 లక్షల మంది ఉన్నట్లు పేర్కొంది. ఈ నెలలో రెండు ఆధార్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. 19 నుంచి 22వ తేదీ వరకు, అలాగే 25 నుంచి 28వ తేదీ వరకు ఆధార్ క్యాంపుల నిర్వహణ జరగనుంది.