జమ్మూలోని శ్రీనగర్లో ఉన్న తులిప్ పూల తోటలు పర్యాటకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. 74 రకాల్లో ఉన్న దాదాపు 17 లక్షల తులిప్ పూలు మార్చి 20 తర్వాత నుంచి అక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఈ పూల తోటల కోసం 11 నెలలుగా శ్రమిస్తోన్నట్లు అక్కడి గార్డెనర్లు తెలుపుతున్నారు. కశ్మీర్ వ్యాలీలో తులిప్ పూతోటలే అతి పెద్ద పర్యాటక ప్రదేశాలుగా ఉంటున్నాయి.