TG: మరో రెండు రోజుల్లో SLBC ఆపరేషన్ పూర్తి చేస్తామని బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. SLBCలో ఆపరేషన్ చివరి దశకు వచ్చిందని తెలిపారు. 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని.. చిక్కుకున్న వారిని కాపాడటం కోసం ఎస్ఎల్బీసీ పూడికలోకి వెళ్లాలని నిర్ణయించామని అన్నారు. పూర్తిగా నీటిని తోడేసి గ్యాస్ కట్టర్ సాయంతో బోరింగ్ మెషీన్ను కట్ చేయాలని మంత్రి స్పష్టం చేశారు.