ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కొత్తగా 100 శాఖలను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కరూర్ వైశ్యా బ్యాంక్ (కెవిబి) ఎండి, సిఇఒ ఆర్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం ఆయోధ్యలో బ్యాంక్ 840వ శాఖను ఛైర్పర్సన్ మీనా హేమచంద్రతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్తగా 39 శాఖలను ప్రారంభించామన్నారు.