సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీ కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా ఉప ఎన్నిక అనివార్యం. ఇక్కడి పోరు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మధ్య అన్నట్లుగా మారింది.