పురాతన కాలం నుంచి కావడి యాత్ర సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. పురాణాలలో రాముడు, రావణుడితో సహ ఎంతో మంది ఈ యాత్ర చేసినట్టుగా చెబుతారు. అయితే మొదట ఈ కావడి యాత్రను శివ భక్తుడైన పరశురాముడు ప్రారంభించినట్లు చెబుతారు. పరశురాముడు గర్హ్ ముక్తేశ్వర్ ధామ్ నుంచి గంగాజలాన్ని తీసుకొచ్చి, ప్రస్తుత యూపీలోని బాగ్పత్ సమీపంలో ఉన్న పుర మహాదేవుడిని అభిషేకించాడు. అప్పటి నుంచి కావడి యాత్ర సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.