విరాట్ కోహ్లీ, బాబర్‌ అజామ్‌ కలిసి ఒకే జట్టుకి ఆడనున్నారా?

82చూసినవారు
విరాట్ కోహ్లీ, బాబర్‌ అజామ్‌ కలిసి ఒకే జట్టుకి ఆడనున్నారా?
భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా.. పాక్ స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ అజామ్‌, షహీన్ అఫ్రిది తదితర ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లో ఒకే జట్టు తరఫున ఆడే అవకాశముంది. గతంలో నిర్వహించిన ఆఫ్రో-ఆసియా కప్‌ను పునరుద్ధరించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్‌ భావిస్తుండమే ఇందుక్కారణం. 2005, 2007లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఇందులో ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి పోటీపడేవారు.

సంబంధిత పోస్ట్