గుజరాత్లోని సూరత్లో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. సార్థనా ప్రాంతంలో రోడ్డు దాటుతున్న మహిళలు, చిన్నారులపైకి ఓ కారు దూసుకెళ్లింది. కొందరిని ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సంఘటనా స్థలంలోనే చనిపోయింది. కొందరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. కారుడ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.