మహిళను కిందపడేసి దారుణంగా కొట్టారు (వీడియో)

40689చూసినవారు
యూపీలోని సిద్ధార్థనగర్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బధ్యా గ్రామానికి చెందిన గుడియా దేవి(45) అనే మహిళను నలుగురు వ్యక్తులు కిందపడేసి దారుణంగా కొట్టారు. ఓ వృద్ధుడు ఆమెను కర్రతో ఘోరంగా కొట్టాడు. కొట్టినవారిలో ఓ మహిళ కూడా ఉంది. పాతకక్షలు కారణంగానే ఆమెను చిత్ర హింసలు పెట్టారని తెలుస్తోంది. చివరికి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :