యూపీలోని ఖుషీనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. పింకీ(36) అనే ఓ వివాహిత మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం దగ్గర మద్యం సీసాలు, ఎనర్జీ డ్రింక్ బాటిళ్లు, కొన్ని బట్టలు లభ్యం కాగా, మృతురాలి శరీర భాగాలపై గాయాలు ఉండడంతో పోలీసులు అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.