ఇవాళ్టి నుంచి మహిళల ఆసియా కప్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి శ్రీలంక అతిథ్యమిస్తుంది. శుక్రవారం యూఏఈ, నేపాల్ మ్యాచ్తో టోర్నీతోపాటు పాకిస్థాన్ను భారత్ ఢీకొట్టనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాక్, నేపాల్, యూఏఈ జట్లు ఉండగా.. గ్రూపు బిలో బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ జట్లను చేర్చారు. ఈనెల 28న ఫైనల్ జరగనుంది.