యాదాద్రిలో ముగిసిన వసంత నవరాత్రి ఉత్సవాలు

579చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. సీతా రామ హనుమత్ మూలమంత్ర జపము, దశ శాంతి పంచసూక్త పారాయణాలతో అభిషేకాలు చేసి రామాయణ పారాయణం నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి, శ్రీ. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఉత్సవాలకు ముగింపు పలికారు. ఆలయ అధికారులు, అర్చక బృందం భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :