
వలిగొండ: పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభలు
యాదాద్రి జిల్లా వలిగొండ మండల వ్యాప్తంగా ఈ నెల 21నుంచి 24వరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలను నిర్వహించనున్నట్లు వలిగొండ మండల ఎంపిడిఒ డి. జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21న అక్కంపల్లి, చిత్తాపురం, దాసిరెడ్డిగూడెం, దుపెళ్ళి, ఎదుళ్ళగూడెం, గోకారం, గోల్నేపల్లి, కాంచనపల్లి, నర్సయిగూడెం, గ్రామాల్లో గ్రామ సభలుంటాయని తెలిపారు.