నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు ప్రారంభం

59చూసినవారు
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు స్వామివారి వార్షిక జయంతి మహోత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 8.30గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, అంకురార్పణ క్రతువులతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా ఆదివారం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో బ్రేక్ దర్శనాన్ని సైతం రద్దు చేశారు. వివిధ విభాగాల నుంచి ఆలయానికి రూ. 85,33,262 ఆదాయం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్