తెలంగాణలో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిర్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని స్పష్టం చేసింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో ఆవర్తనం కేంద్రీకృతమై ఉండటమే ఈ వర్షాలకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.