ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంచిన జొమాటో

54చూసినవారు
ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంచిన జొమాటో
ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో పండగ వేళ ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున వసూలు చేయనుంది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.7 గా ఉండేది. ‘పండగ సీజన్‌లో సేవలు అందించేందుకు ప్లాట్‌ఫామ్‌ ధరలు పెంచాం. మా బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సహాయపడతాయి’ అని కంపెనీ తెలిపింది. ఈ ప్రకటన నేపథ్యంలో కంపెనీ షేర్లు 2.09 శాతం పెరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్