దేశ రాజధాని ఢిల్లీని నీటి సంక్షోభం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా విమర్శించారు. ఢిల్లీలో నీరులేక ప్రజలు అల్లాడుతుంటే.. ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు నీటిని అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. నీటి చౌర్యం, బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకుంటే ఢిల్లీ ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు.