ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కాంలో అరెస్టయిన కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను నేడు కోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ED కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొంది.