జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం: EC

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ ఆంక్షలు విధించింది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 నుండి చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ అనుమతించబడవని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రసారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల అంచనాలు, సర్వేలను ప్రసారం చేయవద్దని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్