వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2020 జూన్ 5న ఆర్డినెన్స్ ద్వారా మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ను చట్టాలుగా మార్చుకునేందుకు అదే సంవత్సరం సెప్టెంబర్ 17-19 తేదీల మధ్య లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం, రైతు ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం వల్ల వ్యవసాయంపై తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతాయి. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో రద్దు చేసింది.