నీట్-పీజీ పరీక్షను వాయిదా వేయడాన్ని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. రాత్రికి రాత్రి పరీక్షను వాయిదా వేయడం కేంద్రం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను పరీక్ష వాయిదాతో కప్పి పుచ్చుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నీట్ పీజీ, యూజీ, నెట్ పరీక్షల వరుస వాయిదాలతో కేంద్రం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నదని విమర్శించారు.