గొర్రెల కాపరి గొంతు కోసి దారుణ హత్య

73చూసినవారు
గొర్రెల కాపరి గొంతు కోసి దారుణ హత్య
గొర్రెల కాపరి దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో శనివారం జరిగింది. రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన మేకం చిన్న ఆంజనేయులు(44) కుమార్తె ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను మందలించి చెంపదెబ్బకొట్టారు. ఈ నెల 21న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన కుమార్తె సాయంత్రం తిరిగొచ్చింది. అదే రోజు రాత్రి ఆంజనేయులు కాలనీ వెనకున్న తన మేకలదొడ్డి వద్దకు వెళ్లి పడుకున్నారు. ఉదయం ఆయన కుమారుడు వెళ్లి చూసేసరికి ఆయన గొంతు కోసి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్