నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కు కొత్త చీఫ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. NTA డైరెక్టర్ జనరల్గా ప్రదీప్ సింగ్ ఖరోలాకు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఇప్పటి వరకు ఆయన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్, ఎండీగా ఉన్నారు. NEET-UG, UGC-NET పరీక్షల పేపర్ లీక్ వల్ల వివాదాలు రేకెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో NTA డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను పదవి నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.