లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 150 సభలు/రోడ్ షోలు నిర్వహించనున్నారు. దక్షిణాదిన ఫోకస్ పెంచారు. మార్చి 25న హోలీ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభమవుతుంది. ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు ఉంటాయి.