అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ అక్కడి నుంచే సీఎస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్