మహిళలకు రూ.2500.. అర్హులు వీరే!

తెలంగాణలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 స్కీంను జూలై నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు సమాచారం. దరఖాస్తుదారు తెలంగాణ నివాసి, వివాహితులై ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళకు మాత్రమే వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటోంది.

సంబంధిత పోస్ట్