55కు చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య

80చూసినవారు
55కు చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 15 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 55కు చేరుకుంది. కళ్లకురిచి ప్రభుత్వాస్పత్రిలో 30 మంది, ముదియాపాక్కమ్ ప్రభుత్వాస్పత్రిలో నలుగురు, సలేమ్ ప్రభుత్వాస్పత్రిలో 18 మంది, పాండిచ్చేరిలో జిప్‌మర్ హాస్పిటల్‌లో ముగ్గురు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఇంకా 70 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్