ఏపీఈఏపీ సెట్కు మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు వెల్లడించారు. ఇంజినీరింగ్కు 2,68,309 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 84,791 మంది, రెండు విభాగాలకు 1135 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రూ.500 పెనాల్టీతో ఈ నెల 30 వరకు, రూ.1000తో మే 5 వరకు, రూ.5 వేలతో మే 10 వరకు, రూ.10 వేలతో మే 12 వరకు ఈఏపీ సెట్కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.