AP: ఎన్నికల నేపథ్యంలో సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. స్వయం సహాయక(డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని ఉత్తర్వులిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల్లోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.