తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 6 గంటలతో తెర పడనుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు తెలిపారు. తక్కువ సంఖ్యలో ప్రభుత్వ అధికారులు ఉన్న జిల్లాల్లోని పోలింగ్ బూత్లలో ప్రధాన అధికారి, ఇద్దరు అధికారులను మాత్రం విధుల్లో నియమించడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందన్నారు. నియోజకవర్గంతో సంబంధంలేనివారు ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఆ స్థానాన్ని విడిచి వెళ్లిపోవాలని పేర్కొన్నారు.