ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా, ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగియడంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునేందుకు జనవరి 24 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.