విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త

61చూసినవారు
విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త
ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మంగళవారం రోజు పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు అధికారులు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మరోవైపు తెలంగాణలో మాత్రం మిలాద్ ఉన్ నబీ సెలవును మంగళవారం జరుపుకోనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన మిలాద్ ఉన్ నబీ సెలవు రోజుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్