టెన్త్ పరీక్షలు రాస్తున్న 53 ఏళ్ల గిరిజన మహిళ

65చూసినవారు
టెన్త్ పరీక్షలు రాస్తున్న 53 ఏళ్ల గిరిజన మహిళ
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మూలపాడుకు చెందిన గిరిజన మహిళ పెద్దమ్మి (53) ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 7వ తరగతి వరకు చదివిన పెద్దమ్మి అనివార్య కారణాలతో గతంలో చదువు మానేసింది. చదువు ఆసక్తి, తపన ఉండటంతో మళ్లీ పదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు పెద్దమ్మి తెలిపింది. భద్రగిరి ఏపీఆర్ కేంద్రంలో ఆమె పరీక్షలు రాస్తున్నారు.

సంబంధిత పోస్ట్