ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి

55చూసినవారు
ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన తల్లి
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో దారుణం చోటు చేసుకుంది. లంకాజోడు గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చింది. అది గమనించిన కుటుంబీకులు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే పిల్లలకు తల్లి విషమిచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్