ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇవాళ కడప జిల్లా ప్రొద్దుటూరులో చంద్రబాబు సమక్షంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేరెడ్డి శివచంద్రారెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కాసేపట్లో ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించనున్నారు.