మంత్రి అలర్ట్‌.. రైతుల‌కు అందుబాటులో ఉండాల‌ని!

586చూసినవారు
మంత్రి అలర్ట్‌.. రైతుల‌కు అందుబాటులో ఉండాల‌ని!
AP: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అలర్ట్‌ చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు.. వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేయాలని సూచనలు చేశారు. జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్