ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టిపెట్టారు. తీర ప్రాంతంలో అలల ఉద్ధృతికి భూమి కోతను నివారించేలా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రిసెర్చ్(ఎన్సీసీఆర్), ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. తీర ప్రాంత నిర్వహణపై ఎన్సీసీఆర్ రూపొందించిన ప్రణాళికను డిప్యూటీ సీఎం విడుదల చేశారు.