రాష్ట్ర ప్రజలందరూ జగనన్న వైపే: మంత్రి జోగి రమేష్

85చూసినవారు
రాష్ట్ర ప్రజలందరూ జగనన్న వైపే: మంత్రి జోగి రమేష్
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ పార్టీ చూడం, కులం చూడం జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. పేదల పక్షాన జగన్, పెత్తందారుల పక్షాన చంద్రబాబు ఉన్నాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ పార్టీని నిర్మిస్తే బాబు వెన్నుపోటు పొడిచి, లాక్కున్నాడని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్