దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 22,368 వద్దకు చేరింది. సెన్సెక్స్ 89 పాయింట్లు ఎగబాకి 73,738 వద్దకు చేరింది. నెస్లే, మారుతీ సుజుకీ, HCL టెక్నాలజీస్, టాటా మోటార్స్, NTPC, ఏషియన్ పెయింట్స్, SBI, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉండగా, సన్ఫార్మా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.